Homemain slidesకార్తీక శుద్ధ చతుర్దశిని ‘వైకుంఠ చతుర్దశి'

కార్తీక శుద్ధ చతుర్దశిని ‘వైకుంఠ చతుర్దశి’

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

కార్తీక శుద్ధ చతుర్దశిని‘వైకుంఠ చతుర్దశి’గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది. ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ , ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. ఇక ఈ కార్తీకమాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను , విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.

హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును తులసి దళాలతోను శివుడిని బిల్వదళాలతోను పూజిస్తుంటారు. ఇక లక్ష్మీపార్వతులు కూడా నోములు వ్రతాలను ఆచరించే ముత్తయిదువులను అనుగ్రహిస్తూ తీరికలేకుండా వుంటారు. అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే‘వైకుంఠ చతుర్దశి’ సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి , ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైన రోజో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు. ఇక ఈ రోజున లింగ వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది.

మరికొన్ని వార్తా విశేషాలు...

కార్తీకమాసం ప్రత్యేక విశిష్టత…

RELATED ARTICLES

Most Popular

Recent Comments