Homemain slidesమీడియా కార్యకర్తల కోసం వైసీపీ పార్టీ బృందాలు

మీడియా కార్యకర్తల కోసం వైసీపీ పార్టీ బృందాలు

భారత్ సమాచార్, అమరావతి ;

సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టుల పెడుతున్న రాజకీయ పార్టీల కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం కేవలం ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల పై మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇదే వరుసలో ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి, సోషల్ మీడియా యాక్టివిస్టు శ్రీ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు అందించారు. దీనిపై ఇప్పటికే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. వారికి మద్ధతు ప్రకటిస్తూ, సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు పార్టీ బృందాలు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు పార్టీ కార్యాలయం ప్రకటించింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం పార్టీ బృందాలు పని చేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్‌ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బృందం పని చేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు.

జిల్లాలవారీగా పార్టీ బృందాలు వివరాలు:

శ్రీకాకుళం:సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్‌

విజయనగరం :బెల్లాని చంద్రశేఖర్, జోగారావు.

విశాఖపట్నం: భాగ్యలక్ష్మి, కెకె రాజు.

తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత

పశ్చిమ గోదావరి: కె.సునిల్‌కుమార్‌ యాదవ్, జయప్రకాష్‌ (జేపీ)

కృష్ణా: మొండితోక అరుణ్‌ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి

గుంటూరు: విడదల రజని, డైమండ్‌ బాబు

ప్రకాశం: టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి

నెల్లూరు: రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)

చిత్తూరు: గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

అనంతపురం: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్‌

కడప: సురేష్‌బాబు, రమేష్‌యాదవ్‌

కర్నూలు: హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు)

మరికొన్ని వార్తా విశేషాలు...

ఇది మొండి ప్రభుత్వం కాదు..వినే ప్రభుత్వం

RELATED ARTICLES

Most Popular

Recent Comments