భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అవహేళన చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అనే అంశంపై ఆమె రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ తల్లిని ప్రజలు వ్యతిరేకించాలి:
తెలంగాణ తల్లి పేరుతో రేవంత్ ఏర్పాటు చేసిన రూపాన్ని కాంగ్రెస్ మాతగా నామకరణం చేద్దామని కవిత తీర్మానించారు. బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేయడం తెలంగాణ సంస్కృతిపై దాడి చేసినట్లేనని ఆమె ధ్వజమెత్తారు. దీన్ని తెలంగాణ సమాజమంతా వ్యతిరేకించాలని కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలకులు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రజలందరినీ అవమానించారని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయి జైలు నుంచి విడుదల అయ్యాక ఆమె తొలి పర్యటన ఇది. కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కవితకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయినా ఆయన పార్టీ మారారంటూ ఇటీవల పార్టీ సమావేశంలో సంజయ్ కుమార్పై కవిత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నేడు దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్ను ఉద్దేశించి ఆమె మాట్లాడనున్నారు.