Homebreaking updates newsటీటీడీ దర్శనాలకు వాళ్లను అడుక్కోవడమేంటి?

టీటీడీ దర్శనాలకు వాళ్లను అడుక్కోవడమేంటి?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తిరుమల దర్శనా (Tirumala Darshan)ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ (TTD) ఉంటే మనకు యాదగిరిగుట్ట (Yadagirigutta)లో వైటీడీ (YTD) ఉందని పేరకొన్నారు. ప్రతిసారి ఎమ్మెల్యేల లెటర్లు అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లారంటే.. ‘‘తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని.. టీటీడీ అధికారులను ప్రతిసారీ అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? మనకు భద్రాచలంలో రాముడు లేడా..? మనకు శివాలయాలు తక్కువున్నాయా..? తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు మన తెలంగాణలోని దేవాలయాలకు వెళ్లొచ్చు కదా అని అన్నారు. అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం మన తెలంగాణ సొంతమన్నారు. మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. సిలికాన్ వ్యాలీయే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. నిన్ననే‌ మెక్‌డొనాల్డ్ కంపెనీ హైదరాబాద్‌కు వచ్చిందన్నారు.

 

ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ ఇటీవల చాలా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే, ఎంపీలు బహిరంగాగానే వాపోయారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలంటూ పలువురి నేతల నుంచి విజ్ఞప్తులు కూడా అందాయి. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శనంపై సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments