Homebreaking updates newsతెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: తెలంగాణ (Telangana) ఎమ్మెల్యేల ఫార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌(Gaddam Prasad Kumar)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి గడువు ముగియడంతో మరోసారి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈసారి తప్పకుండా స్పందించాలని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది.

 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ 10 మందిపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరాటానికి దిగింది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ సర్కార్‌కు అసెంబ్లీ స్పీకర్‌కు మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు ఇంకెంత కాలం గడువు కావాలి.. ఐదేళ్ల కాలం ముగిసే వరకూ కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 25న విచారణ జరగనుంది. దీంతో గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సహా 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెక్రటరీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. మార్చి 22 వరకు ఈ నోటీసులపై స్పందించాల్సి ఉంది. కానీ సమాధానం లేకపోవడంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.

 

తొలుత ఈ కేసులో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments