Homemain slidesతంజావూరు బృహదీశ్వర ఆలయం ప్రత్యేకత

తంజావూరు బృహదీశ్వర ఆలయం ప్రత్యేకత

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటిగా పేరు గాంచింది. ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎత్తు అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం . ఈ లింగానికి అసలు పేరు ‘‘అడ వల్లన్’’ అంటారట. దీని అర్ధం నాట్యానికి ప్రతీకగా నాట్యం చేసే వాడు అని అర్ధం. దీనికే ఈ పుణ్య క్షేత్రానికి దక్షిణ కైలాసం అనే కూడా పేరు ప్రసిద్ది లో ఉంది. అలాగే ఈ లింగమును కట్టినపుడు అక్కడి ప్రజలు రాజు యొక్క ప్రభువు అని అర్థం వచ్చేలా ద్రావిడ భాషలో రాజ రాజేశ్వర ముదయార్ అని పిలిచేవారని ప్రఖ్యాతి. ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారి దర్శనానికి మాత్రమే వీలుగా ఉండేదని పెద్దలు చెప్పేవారు. ఏక శిలా నిర్మితములైన ఈ ఆలయ భాగాలు అద్బుతముగా కనువిందు చేస్తాయి. కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు 6 సంవత్సరాల కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది. అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా చేసే ఏర్పాట్లు చేశారు.ఈ ఆలయ శిఖరమునకు 235 పౌన్ల బరువున్న రాయి పైకి చేర్చడానికి పడ్డ కష్టాల గురించి పూర్వికులు ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

పూరీ జగన్నాథ ఆలయ పూర్తి చరిత్ర, ప్రత్యేకత, విశిష్ఠత

RELATED ARTICLES

Most Popular

Recent Comments