భారత్ సమాచార్, నల్గొండ: నల్గొండ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి చెందాడు. మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావుగా పోలీసులు గుర్తించారు. నటుడు రఘుబాబు కారు ప్రమాదవశాత్తూ ఓ బైక్ని ఢీకొట్టింది. నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత స్పాట్డెడ్:
నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు(51) BRS టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్డుండేవాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావుకు తీవ్ర గాయాలు స్పాట్లోనే మృతి చెందాడు. మృతుని భార్య నాగమణి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు. అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. బైక్పై వచ్చిన వ్యక్తి ఎటువైపు నుంచి వచ్చాడు. ఎలా ప్రమాదం జరిగింది అని రఘుబాబు వారితో మాట్లాడాడు. అయితే రఘుబాబు టెన్షన్ పడుతూ ఉండగా పక్కన ఉన్న వ్యక్తులు వాటర్ తాగమని సూచించారు.
మరిన్ని కథనాలు: