Homebreaking updates newsAirtel: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కలిసి పోరాడాలి: ఎయిర్‌టెల్

Airtel: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కలిసి పోరాడాలి: ఎయిర్‌టెల్

భారత్ సమాచార్.నెట్: డిజిటల్ మోసాలను (Digital Fraud) అరికట్టేందుకు కలిసి పోరాడాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌‌టెల్‌ (Airtel) పిలుపునిచ్చింది. దాదాపు 40 బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (Reserve Bank of India), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల (National Payments Corporation of India)కు ఎయిర్‌టెల్ లేఖ రాసింది. అందరూ కలిసి మోసపూరిత ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంది.

ఇప్పటికే వెలుగులోకి వచ్చిన మోసాలకు సంబంధించిన ఆర్థిక డొమైన్‌లను ఒక రిపాజిటరీ రూపంలో రూపొందించి.. నకిలీ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడంతో పాటు డిజిటల్‌ మోసాలను విభిన్న దశలలో ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్‌ అభిప్రాయపడింది. మోసాలకు పాల్పడుతున్న ఆర్థిక డొమైన్‌ల వివరాలను పంచుకోవడానికి సంయుక్త రిపాజిటరీ ఏర్పాటు చేయాలన్న సూచనను ఎయిర్‌టెల్‌ ఆర్‌బీఐకి కూడా పంపించింది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను కస్టమర్ల భద్రతకు జవాబుదారీగా ఉంచే ఫ్రేమ్‌వర్క్ నిర్మించాలనే ఆర్‌బీఐ ఆలోచనకు మద్దతిచ్చింది ఎయిర్‌టెల్. వినియోగదారుల భద్రతను పెంచే విధంగా ఒక సమగ్ర నియమావళిని రూపొందించడంలో భాగస్వామ్యంగా ఉంటామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. డిజిటల్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని కూడా సూచించింది. భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఎయిర్‌టెల్‌-ఎన్‌పీసీఐ మధ్య భాగస్వామ్యం కీలకమని సంస్థ స్పష్టంచేసింది.

RELATED ARTICLES

Most Popular