Homemain slidesఆషాడ మాసంలో అంబానీ పెళ్లి...

ఆషాడ మాసంలో అంబానీ పెళ్లి…

భారత్ సమాచార్, ముంబయి ;

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నెన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంక ట్రోల్స్ కి అయితే అంతే లేదు. పెళ్లికి వచ్చిన ప్రత్యేక అథితులందరికి రూ.2 కోట్ల వాచ్ గిప్ట్ ఇచ్చారని, నీతా అంబానీ ధరించిన నక్లెస్ విలువ రూ.500 కోట్లకు పై మాటే అని, పెళ్లి సంగీత్ లో కేవలం ఇద్దరు పాప్ సింగర్స్ వాయిస్ కోసమే రూ.150 కోట్లు ధారపోశారని, మొత్తంగా పెళ్లికి రూ.5 వేల కోట్లు వెచ్చించారని… ఇంకా ఎన్నెన్నో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అలాంటి సందర్భంలోనే వాట్సాఫ్ యూనివర్శిటీలో ఈ పెళ్లి గురించిన మరో ప్రత్యేకమైన వార్త కనిపించింది.

అదే ఆషాడ మాసంలో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల పెళ్లి ముహూర్తం. సాధారణంగా ఆషాడ మాసంలో అసలు పెళ్లి ప్రస్తావనే ఉండదు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా భారతదేశంలోనే అత్యంత ధనవంతులైన… కాదు, కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన అంబానీ ఇంట ఆషాడ మాసంలో పెళ్లి తంతు ఏమిటనేది ఆన్ లైన్ జీవులకు ఎంతకూ అంతు బట్టడం లేదు. దీనిపై ఎవరూ వివరణ కూడా ఇవ్వటం లేదు. దీంతో ఎవరికి తోచింది వాళ్లు నెట్టింట రాసేసుకుంటున్నారు….

ఆషాఢం లేదు, గీశాడం లేదు, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆషాఢ మాసాన అల్లుడూ అత్తా ఒక వాకిట్లో తిరగకూడదట. అందుకని ఈ నెలలో ముహుర్తాలు లేవని పెళ్లి చెయ్యరు.
ముహుర్తాలన్నీ పురోహితుల సృష్టి మాత్రమే అని నిన్న బొంబాయిలో జరిగిన అంబానీ కుటుంబంలో జరిగిన వివాహంతో బట్టబయలైంది. అసలు ముహుర్తాలు మోసం అని, ఇందంతా పురోహితుల పొట్టకూటి కోసం తప్ప ముహూర్తంలో ఎలాంటి బలం లేదని 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు ఎలుగెత్తి చాటారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రజా కవి వేమన కూడా ముహుర్తాలను ఉతికి ఆరేశాడు. అదే బాటలో సంస్కరణ వాదులు పెరియార్, త్రిపురనేని, గొరా లాంటివారు ప్రజలను చైతన్య పరిచారు. ఆధునిక విజ్ఞానం ఈ ముహుర్తాలను, గ్రహబలాలను కొట్టిపారేస్తుంది. జాతకాలు నక్షత్రబలం అన్ని బూటకం అని చెప్తుంది. వివాహానికి కావలసింది ముహూర్తం, లగ్నం, పెళ్లి మంత్రాలు, జాతకాలుకాదు. యువతి, యువకులకు ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం, ఆప్యాయత తప్ప బ్యాండుమేళాలు, పెళ్లి మంత్రాల పేరుతో బూతులు కావు అని ఈరోజు జరిగే ఆదర్శ వివాహాలు రుజువు చేస్తున్నాయి.

పెళ్లి అనగానే అందరికీ గుర్తు వచ్చేది సీతారాముల వివాహం. ఉదాహరణకి సీతారాముల వివాహానికి వసిష్ఠుడు పెట్టి ముహూర్త బలం ఏమయింది? భార్యాభర్తలు అడవులపాలు. సీత రామునిచేత అవమానాలు. చివరికి సీత భూదేవిలో కలసిపోవటం, రాముడు సరయూనదిలో మునిగిపోవటం… ఆత్మహత్య. ముహుర్తాలలో ఏమాత్రం బలం లేదని ఏనాడో తేలిపోయింది. అబ్బాయి, అమ్మాయిలు ఒకరి కొకరు ఇష్టపడితే, ఇద్దరి ఫోటోలు, పుట్టినతేదీలు, ఇద్దరు పెద్దమనుషులు తో రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్ 1954 క్రింద రిజిస్టర్ చేసుకుంటే, 30 రోజుల తరువాత రిజిష్ట్రార్ పెళ్లి అయినట్లు సర్టిఫికెట్ ఇస్తాడు. 50 రూపాయల ఫీజు ఉంటుంది. అంటే 50 రూపాయలతో వివాహం చేసుకోవచ్చు.

(కొన్ని మార్పులతో వాట్సాఫ్ యూనివర్శిటి నుంచి సేకరణ)

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

మనం కడుతున్న ట్యాక్సులకు విలువ లేదా.. మన బతుకులు మారవా..?

RELATED ARTICLES

Most Popular

Recent Comments