Homebreaking updates newsఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా పాత్రికేయులు కావాలనుకునే అభ్యర్థుల నుంచి ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరాలంటే ఏం కావాలి? ఏం చేయాలి? పూర్తి వివరాలు మీకోసం..

అర్హతలు:

ఇంగ్లీషు భాషలో వ్యవహారజ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగల నేర్పు వర్తమాన విషయాలపై అవగాహన, విశ్లేషణ సామర్థ్యం సరళమైన తెలుగులో రాయగలగడం చక్కటి భావవ్యక్తీకరణ, డిగ్రీ ఉత్తీర్ణత, 35 సంవత్సరాలకు మించని వయసు ఉండాలి.

దరఖాస్తు విధానం:

మీలో పై అర్హతలన్నీ ఉంటే పూర్తి పేరు, వయసు, విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, ఉద్యోగానుభవం, ఆసక్తులు వగైరా వివరాలన్నిటితో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తుకు సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులు, ఇటీవల తీసుకున్న రెండు ఫొటోలు జతపరచాలి. దరఖాస్తులోను, కవరుపైన మీ పూర్తి చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పరీక్ష రాయదలచుకున్న కేంద్రం స్పష్టంగా రాయాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు ఫోన్‌ ద్వారా మాత్రమే తెలియపరుస్తాం. అందువల్ల మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే మొబైల్‌ నెంబర్‌నే దరఖాస్తులో ఇవ్వాలి.

సోషల్ మీడియా మితిమీరి వ్యవహరిస్తోందా? – ఈ అంశంపై సొంతంగా రాసిన వ్యాసాన్ని దరఖాస్తుకు తప్పనిసరిగా జతచేయాలి. వ్యాసం లేని దరఖాస్తులను పరిశీలించరు.

ఎంపిక: అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. రాతపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. అభ్యర్థుల ఎంపికలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే తుది నిర్ణయం. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లు పని చేస్తామని హామీపత్రం ఇవ్వాలి.

శిక్షణ: ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో కనీసం ఆరునెలల శిక్షణ ఉంటుంది. భాష, భావవ్యక్తీకరణ, వర్తమాన వ్యవహారాలపై అవగాహన, అనువాదం, ఎడిటింగ్‌లలో శిక్షణ ఉంటుంది. శిక్షణ ముగించుకున్నాక ట్రైనీ ఉద్యోగులుగా అవకాశం లభిస్తుంది. వారు ఆంధ్రజ్యోతి యూనిట్లలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

వేతనం: శిక్షణ కాలంలో నెలకు రూ. 12,000. శిక్షణ అనంతరం ముఖ్య విభాగాల్లో పని చేయడానికి అర్హులైన వారికి పనితీరును బట్టి రూ. 18,000 నుంచి 20,000. జిల్లా విభాగాల్లో పని చేయడానికి ఎంపికైన వారికి రూ. 16,000 నుంచి 18,000 వరకు ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు..
హైదరాబాద్
వరంగల్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి

దరఖాస్తులు చేరాల్సిన ఆఖరి తేదీ: 2024, జులై 28

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ప్రిన్సిపాల్‌, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్‌, ప్లాట్‌ నెం. 76, జూబ్లీహిల్స్‌, రోడ్డు నం. 70, హైదరాబాద్‌ – 500 110.

మరికొన్ని వార్తా విశేషాలు…

స్కాలర్ షిప్ కోసం ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్’

RELATED ARTICLES

Most Popular

Recent Comments