Homemain slidesట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు అసహనం

ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు అసహనం

భారత్ సమాచార్, అమరావతి ;

టైమ్ ఈజ్ మనీ అని నమ్మే ఉరుకులు పరుగుల సమాజం ఇది. జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వడం లేదు. ఇందుకు భారీ మూల్యం కూడా చెల్లించక తప్పడం లేదు. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇందుకు అడ్డుకట్టవేయడానికి హైకోర్టు వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ అందుకు సంబంధించిన నిబంధనలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు తాజాగా ట్రాఫిక్ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 99శాతం మంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారని హైకోర్టు వ్యాఖ్యనించింది. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని ఇచ్చిన అదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టీకరణ చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. తాము ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంత మంది ప్రమాదాల్లో మరణించారు? ఇప్పటి వరకూ ఎన్ని చలానాలు విధించారు? తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరికొన్ని వార్తా విశేషాలు…

వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం

RELATED ARTICLES

Most Popular

Recent Comments