Homemain slidesదివ్యాంగులకు బిగ్ అలర్ట్...సదరం స్లాట్ బుకింగ్

దివ్యాంగులకు బిగ్ అలర్ట్…సదరం స్లాట్ బుకింగ్

భారత్ సమాచార్, అమరావతి ;

అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైకల్య ధ్రువీకరణ పత్రం (ఫిజికలీ హ్యండీ క్యాప్డ్ సర్టిఫికెట్) ను పొంది ఉండాలి.అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ఫెన్షన్ , రాయితీలు, దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, దివ్యాంగుల రిజర్వేషన్, ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలను పొందగలం.దీన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాత్రమే పొందగలం. ఈ సర్టిఫికెట్ ను పొందాలనుకునే అర్హత గల దివ్యాంగులు ముందుగా సదరం స్లాట్ ను బుక్ చేసుకోవాలి. వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు జులై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇందుకోసం స్థానిక సేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్ల ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అధికారులు కేటాయించిన తేదీలో మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వైకల్యం ఉన్న వ్యక్తులు వెళ్లాలి. అక్కడ ప్రభుత్వ వైద్యాధికారి పరీక్షించి, అర్హత గల వ్యక్తులకు వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

అంగవైకల్యం ఉన్న పిల్లలు ఉచిత విద్య మరియు, విద్యా రిజర్వేషన్ల కోసం, ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం, వైకల్య ధ్రువీకరణ పత్రం అత్యంత అవసరం. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

విద్యుత్ బిల్లులు చెల్లింపు పై ఆర్బీఐ మార్గదర్శకాలు

 

RELATED ARTICLES

Most Popular