భారత్ సమాచార్.నెట్, మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని కురినిశెట్టి కాలనీలో బీజేపీ బూత్ కార్యకర్త దోమ సాయికుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “మన్ కి బాత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి:
మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ దేశ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. యువత, రైతులు, మహిళలు, సామాన్య ప్రజలకు ఇది ఒక చైతన్యవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బీజేపీకి గ్రాస్రూట్ స్థాయిలో బలపడే అవకాశం లభిస్తుందని, మోడీ ఆలోచనలు గ్రామ గ్రామానికి చేరవేయడమే మా ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి కార్యకర్తలు, వీరన్నపేట వార్డుకు చెందిన కౌన్సిలర్ చెన్నవీరయ్య, ఇతర బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.