Homemain slidesఇక అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్

ఇక అన్ని ఆస్పత్రుల్లోనూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్

భారత్ సమాచార్, ఆరోగ్యం : ఆరోగ్య బీమా తీసుకున్న వారు ఇక అన్ని ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో గురువారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ‘‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’’ ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బీమా పాలసీ నెట్ వర్క్ జాబితాలో పేరు లేని ఆస్పత్రుల్లనూ క్యాష్ లెస్ సదుపాయాన్ని పొందవచ్చని స్పష్టం చేసింది.

నెట్ వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ సదుపాయం పొందాలనుకుంటే 48 గంటల ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో అయితే ఆస్పత్రిలో చేరిన 48 గంటలలోపు సమాచారం చేరవేయాల్సి ఉంటుంది. బీమా పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ చేసుకోవచ్చని కౌన్సిల్ వివరించింది.

కాగా, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సంబంధిత నెట్ వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే క్యాష్ లెస్ సేవలకు అనుమతి ఉంటుంది. ఈ సదుపాయం లేని చోట చికిత్సకు అయ్యే ఖర్చును సొంతంగా జేబులోంచి చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత ఖర్చులకు సంబంధించి రీయింబర్స్ మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం వల్ల కస్టమర్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. రిఫండ్ ప్రక్రియ సైతం ఆలస్యంగా జరిగేది.

తాజా నిర్ణయంతో కస్టమర్లకు ఈ సమస్యల బెడద తప్పనుంది. క్యాష్ లెస్ సదుపాయంపై ఇప్పటికే ఆయా బీమా కంపెనీలు కస్టమర్లకు మెసేజ్ లు పంపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో దేశంలో హెల్త్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.

మీ కోసం మరికొన్ని కథనాలు…

రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments