భారత్ సమాచార్.నెట్: దేశంలోని పలు నగరాల్లో (Cities) సమయం ఆదా చేసుకునేందుకు (To Save Time) చాలా మంది ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) వంటి క్యాబ్ సర్వీసులు (Cab Services) ఉపయోగించే సంగతి తెలిసిందే. అయితే ఈ క్యాబ్ సర్వీసులు ఒక్కోసారి అనుకున్న టైమ్కు దొరకవు. ఒకవేళ దొరికిన వెంటనే డ్రైవర్లు రారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఊబర్ క్యాబ్ సర్వీసెస్ అడ్వాన్స్ టిప్ (Advance Tip) పద్దతిని ప్రవేశపెట్టింది. టిప్ చెల్లిస్తే తొందరగా క్యాబ్ డ్రైవర్లు వస్తారని ఉబర్ తెలిపింది.
అయితే ఉబర్ ప్రవేశపెట్టిన ఈ సర్వీసెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ టిప్పై వివరణ కోరుతూ కేంద్ర కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఉబర్కు నోటీసులు జారీ చేసింది. అడ్వాన్స్ టిప్ వసూలు చేయడం అనైతికం అని పేర్కొంది. వినియోగదారులు సేవలను మెచ్చి టిప్ ఇవ్వాలి.. ఇలా బలవంతంగా టిప్ వసూలు చేయడం సరికాదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని సీసీపీఏను కోరగా.. అడ్వాన్స్ టిప్పై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
మరోవైపు ఉబర్తో పాటు ఓలా ఇతర క్యాబ్ బుకింగ్ సర్వీసెస్ల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఉబర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఇంతకు ముందు డిఫరెన్షియల్ ప్రైసింగ్ వివాదంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఉబర్, ఓలా యాప్లు ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైస్లలో ఒకే రైడ్కు భిన్నమైన ధరలు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు రావడంతో సీసీపీఏ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.