Homemain slidesనేడు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

నేడు సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

భారత్ సమాచార్, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఇకపోతే ఓటుకు నోటు కేసు విషయమై ఇప్పటికే రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని ఒక పిటిషన్ దాఖలు చేయగా కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఇక సుప్రీంకోర్టులో ఆ రెండు పిటిషన్లు విచారణకి వచ్చినప్పటికీ… పలుమార్లు విచారణ వాయిదా పడింది. దీంతో గురువారం విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వేళ ఎలాంటి తీర్పు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు ఓటుకునోటు కేసులో చంద్రబాబు తరుపు న్యాయవాదులపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా కేసును కావాలనే సాగదీస్తున్నారని మండిపడ్డారు.

డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేల కొనుగోలు:
తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలతో 2015లో ఈ ఓటుకు నోటు కేసు ఫైల్ అయ్యింది. అయితే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇక అప్పట్నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. గత ఐదు నెలల్లోనే పలు కారణాలు చూపి చాలా వాయిదాలు కోరారు చంద్రబాబు తరుఫు న్యాయవాదులు. దీంతో గురువారం విచారణ కోర్టు తీరుపై ఉత్కంఠ నెలకొంది.

 

మరిన్ని కథనాలు:

వైసీకీ ఓటమి.. షాకింగ్ సర్వే

RELATED ARTICLES

Most Popular

Recent Comments