భారత్ సమాచార్, సినీ టాక్స్ : కన్నడ స్టార్ హీరోల్లో దర్శన్ ఒకరు. ఆయన భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన లేటెస్ట్ మూవీ ‘కాటేరా’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం కన్నడ భాషలోనే రూ.200 కోట్లు వసూలు చేసింది. ఇంతటి భారీ సక్సెస్ ను కూడా దర్శన్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. దీనికి కారణం దర్శన్ భార్య విజయలక్ష్మి, ఆయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగడమే.
ఈ కాంట్రావర్సీ విజయలక్ష్మి పోస్ట్ చేయడంతో మొదలైంది. భర్త దర్శన్, కొడుకుతో కూడిన ఫొటో పోస్ట్ చేసిన విజయలక్ష్మి .. ‘‘ఇది మా కుటుంబం. మా వన్ అండ్ ఓన్లీ సన్ తో’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. విజయలక్ష్మి పోస్ట్ కు కౌంటర్ గా పవిత్ర గౌడ్..‘ మా బంధానికి పదేళ్లు..లవ్ ఫర్ ఎవర్’’ అంటూ దర్శన్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో ఓ వీడియో పోస్ట్ చేసింది. పవిత్ర గౌడ్ చేసిన పనికి విజయలక్ష్మి హర్ట్ కావడంతో కోపం కట్టలు తెచ్చుకుంది.
పవిత్రకు కౌంటర్ గా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. పవిత్ర గౌడ్ భర్త సంజయ్ గౌడ్, ఆమె కూతురు ఖుషీ గౌడ్ తో కూడిన ఫొటోలు షేర్ చేస్తూ.. తన కుటుంబాన్ని సొసైటీలో చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ పోస్ట్ చేసింది. విజయలక్ష్మి వర్సఎస్ పవిత్ర గౌడ్ సోషల్ మీడియా వార్ తో దర్శన్ ‘కాటేరా’ సక్సెస్ మీట్ ను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా 2011లో విజయలక్ష్మి తన భర్త దర్శన్ మీద గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ జైలు పాలయ్యాడు. 14 రోజులు రిమండ్ లో ఉన్నాడు. తర్వాత ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. ఇక 2015లో దర్శన్-పవిత్ర మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ.. వార్తలు వచ్చాయి. 2017లో దర్శన్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోను పవిత్ర పోస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ మండిపడడంతో దాన్ని తొలగించింది.