Homemain slidesచార్మినార్ గడియారం డ్యామేజీ...

చార్మినార్ గడియారం డ్యామేజీ…

భారత్ సమాచార్, జాతీయం ;

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పర్యటించాలంటే మొదట గుర్తుకొచ్చే వాటిల్లో చార్మినార్ ముందు వరుసలో ఉంటుంది. చార్మినార్ సమీపంలోని గుడి పేరుగ ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం చార్మినార్ కు కెమికల్ ట్రీట్ మెంట్ ప్రక్రియ చేపట్టే క్రమంలో ఇనుప పైపు తగిలి డయల్ బోర్డు దెబ్బతిందని చెబుతున్నారు. పావురాలతో ఈ డ్యామేజీ అయిందని మరికొందరి వాదనగా ఉంది. అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు ఇది వరకే ప్రకటించారు.

లండన్ నుంచి తెప్పించిన గడియారాలు

కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదో పాలకులు మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ ను నిర్మించారు. ప్లేగు వ్యాధిని సమర్థవంతంగా నిర్మూలించినందుకు గుర్తుగా చార్మినార్ ను నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. హైద్రాబాద్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చార్మినార్. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడం చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తుంటారు. చార్మినార్ కు నాలుగు వైపులా నాలుగు గడియారాలను 1889లో అమర్చారు. అప్పట్లోనే లండన్ నుంచి ఈ గడియారాలను తెప్పించారు. వాహిద్ వాచ్ కంపెనీ ఈ గడియారాలను తయారు చేసింది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

కారు కన్నా ఖరీదైన పేడ పురుగు

RELATED ARTICLES

Most Popular