భారత్ సమాచార్, ఆరోగ్యం ;
ఇంట్లో మనుషుల కన్నా మొబైల్ , ల్యాప్ టాప్, ఆండ్రాయిడ్ టీవీ వంటి డిజిటల్ వస్తువులే ఎక్కువగా ఉంటున్న రోజులివి. దీంతో చిన్నారులు కూడా కుటుంబ సభ్యుల కన్నా డిజిటల్ వస్తువులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. డిజిటల్ పరికరాలు, ఆన్లైన్ కార్యకలాపాల వినియోగం తీవ్రంగా పెరగడాన్ని డిజిటల్ లేదా ఆన్ లైన్ లేక సైబర్ వ్యసనంగా చెబుతారు. ఇది ఆన్ లైన్ ప్రవర్తనపై నియంత్రణ కోల్పోవడానికి దారి తీస్తుంది. అలాగే జీవితంలోని పలు అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా చూపిస్తుంది. డిజిటల్ స్రీన్స్ పై ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత బాధ్యతలను విస్మరించడం సైబర్ వ్యసనానికి ప్రాథమిక సంకేతం. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్లను దూరం చేస్తే చిరాకు పడటం, మొండిగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇంట్లో వారితో కంటే ఆన్ లైన్ స్నేహితులతో మాట్లాడటానికి ప్రాధాన్యం ఇస్తుంటారు.ఇక శారీరక ఆరోగ్యం పైనా దీని ప్రభావం ఎంతలా ఉంటుందో చెప్పనవసరం లేదు. బరువు పెరగడం, శారీరక దృఢత్వాన్ని కోల్పో వడంతోపాటు నిశ్చల జీవనశైలికి పిల్లలు అలవాటు పడుతున్నారు.
ఈ రోజుల్లో చాలామందికి నిద్ర లేవగానే, పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ చూడటం అలవాటైపోయింది. మాట్లాడటానికి, డబ్బు లావాదేవీలకు, ప్రయాణాలకు, వినోదానికి, కాలక్షేపానికి,,ఇలా ప్రతి అంశంతో సెల్ ఫోన్ ముడిపడిపోయింది. ఒక ఇంట్లో వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు అందరి వేళ్లు టచ్ స్క్రీన్స్ పైనే ఉంటున్నాయి. ఈ పరికరం సాంకేతిక తను దగ్గర చేస్తూనే.. సైబర్ వ్యసనాన్నీ పెంచేస్తోంది. ముఖ్యంగా చిన్నారులను ప్రమాదపుటంచుల్లోకి నెట్టేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల్లో డిజిటల్ ఎడిక్షన్
సైబర్ బానిసత్వం కారణంగా పిల్లలకు కలిగే అనర్ధాలను బహిరంగపరచాలన్న ఉద్దేశంతో ఓ స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ ఇటీ వల మెట్రో నగరాల్లో వెయ్యి మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. ప్రధానంగా తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, సామాజిక అంతరాలు ఏర్పడటం, చదువులో వెనుకబడటం లాంటి అనర్థాలు కలుగుతున్నట్లు గుర్తించింది.5-16 ఏళ్ల వయసున్న వెయ్యి మంది పిల్లల్లో 60% మంది సైబర్ బానిస మనస్తత్వం కలిగి డిజిటల్ ఎడిక్షన్ తో బాధపడుతున్నారు. ఆన్ లైన్ కంటెంట్ వినియోగం నుంచి తమ పిల్లలను ఎలా మాన్పించాలనే అంశంలో 85% మంది తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం లేదు. ఈ విషయంలో వారంతా తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. 70-80% మంది పిల్లల్లో స్క్రీన్ టైం మోతాదుకు మించి ఉంటోంది. ఆన్ లైన్ గేమ్ లు ఆడటంతోపాటు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. స్మార్ట్ఫో ఫోన్ ల లో‘పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ ద్వారా పిల్లల స్క్రీన్ప్లేంను నియంత్రించే అవకాశమున్నా 10% మంది తల్లిదండ్రులే దీనిని వినియో గిస్తున్నారు.
పేరెంట్ కంట్రోల్…
పిల్లలు క్రీడలు, వ్యాయామ కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలి. సామాజిక కార్య క్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలి. చిత్రలే ఖనం, పుస్తక పఠనం లాంటి ఆసక్తులను పెంపొందించాలి. డిజిటల్ పరికరాల నుంచి ఒకేసారి దూరం చేయకుండా క్రమేపీ విరామ సమయాన్ని పెంచుతూ వెళ్లాలి. కుటుంబసభ్యులతో, స్నేహితులతో తరచూ బహి రంగ సంభాషణ లకు అవకాశం కల్పించాలి. ఆరోగ్య కరమైన డిజిటల్ జీవనశై లిని ఏర్పాటు చేసుకునే వ్యూహాలను రూపొందించాలి. ఈరోజుల్లో పిల్లలకు డిజిటల్ విజ్ఞానం కావాల్సిందే. కానీ దానికి బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకు చిన్నారుల స్మార్ట్ ఫోన్ లో పేరెంట్ కంట్రోల్ పీచర్లను వినియోగించాలి. దీని ద్వారా ఫోన్ వినియోగ సమయ నియంత్రణ, హానికర యాప్లు, వెబ్సైట్లు తెరవకుండా చేయడంతోపాటు వారు ఫోన్లో ఏం చూశారో కూడా తెలుసుకోవచ్చు. పిల్లలను నెట్టింట అనవసర విషయాల జోలికి వెళ్లకుండా నిరోధించవచ్చు.