Homemain slides'ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే అలా జరిగింది'

‘ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే అలా జరిగింది’

భారత్ సమాచార్, మెదక్: పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. మెదక్ నియోజకవర్గంలో పర్యటించి సెంటిమెంట్ కురిపించారు. తాజాగా.. మెదక్‌ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌, బీజేపీపై విరుచుకుపడ్డారు. మెదక్‌ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఇందిరాగాంధీ సెంటిమెంట్‌ను పండించారు. ఇందిరమ్మ తుదిశ్వాస విడిచేనాటికి మెదక్ ఎంపీగానే ఉన్నారని గుర్తు చేశారు. మెదక్ ఎంపీగా గెలిచి ఆమె ప్రధాని అయిన తర్వాతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

సీఎంకు కౌంటర్ ఎటాక్:
దుబ్బాక ప్రజలు తిరస్కరిస్తే బీజేపీ నేత రఘునందన్‌రావు మళ్లీ మెదక్‌ ఎంపీగా పోటీ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాకలో ఏ రంగుతో పోటీ చేశానో.. అదే రంగుతో మెదక్‌లోనూ పోటీ చేస్తున్నానంటూ రేవంత్‌కి కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ సీనియర్‌ నేత రఘునందన్‌రావు. ఇక.. పదేళ్లలో మెదక్‌ జిల్లాకు ఏం చేశారన్న రేవంత్‌ కామెంట్స్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. సింగూరు జలాలు మెదక్‌ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. మొత్తంగా.. మెదక్‌ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్‌, బీజేపీని సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌ చేయగా.. అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు హరీశ్‌రావు, రఘునందన్‌రావు.

నేడు భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి రాక:
భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిత్యం దిశానిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని రోజుకో జిల్లాలో జనజాతర పేరుతో భారీ బహిరంగ సభలతో ప్రచారం ముమ్మరం చేశారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భువనగిరి పట్టణానికి రానున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి పట్టణంలో నిర్వహించే సీఎం భారీ ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రేపు ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి:
భారత్ సమాచార్, ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.

ఆత్రం సుగణ.. మొన్నటి వరకు ప్రభుత్వ టీచర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొదటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన సుగణ.. అనేక ప్రజా ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. సాధారణ టీచర్ అయిన సుగుణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కటంపై అనేక వర్గాల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

 

మరిన్ని కథనాలు:

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ నెంబర్ ప్లేట్ ఛేంజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments