Homemain slidesసీఎం... యువతకు క్షమాపణ చెప్పాలి

సీఎం… యువతకు క్షమాపణ చెప్పాలి

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

సీఎం రేవంత్ రెడ్డి తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ రాష్ట్ర యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నేడు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారని ఆరోపించారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నదన్నారు. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు… లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం అన్నారు.

రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మటికే రేవంత్, రాహుల్ గాంధీలే అన్నారు. గతంలో ఏ పరీక్ష రాస్తుండని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేసిండో చెప్పాలన్నారు. అశోక్ నగర్ లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్… మీరు సన్నాసులా… రాహుల్ గాంధీ సన్నాసులా అనే విషయం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఉద్యోగాల పైన, నోటిఫికేషన్ల పైన, జాబ్ క్యాలెండర్ పైన శ్వేత పత్రం ప్రకటించాలన్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ రేషియోను 1:100 గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదన్నారు. ఈరోజు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ , రాష్ట్రంలోని యూనివర్సిటీలో విద్యార్థులు అడుగుతున్నది కాంగ్రెస్ ఇచ్చిన హామీలే అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల గురించి అడుగుతున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులను పెంచమని అడుగుతున్నారు. నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన హామీలు నెరవేర్చకపోతే క్షేత్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవాలి…సీఎం

RELATED ARTICLES

Most Popular

Recent Comments