భారత్ సమాచార్, అమరావతి ;
వైఎస్ఆర్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై నేడు సంచలన ఫిర్యాదు నమోదు అయింది. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భవతి అయిందని అందుకు కారణం విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ లాయర్ సుభాష్ లే కారణం అని దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు అందింది. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఈ ఫిర్యాదు చేశారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని దేవాదాయ కమిషనర్ ను ఫిర్యాదులో కోరారు. కూటమి ప్రభుత్వం ఇటీవలే అసిస్టెంట్ కమిషనర్ శాంతి ని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో, దేవదాయ శాఖలో ఈ ఫిర్యాదు పెను సంచలనంగా మారింది. ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండీ టీడీపీ ఎమ్మెల్యే రఘరామకృష్ట రాజు తనను చిత్ర హింసలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డి ఉదంతంతో వైసీపీ పార్టీలో చాలా మంది కామాంధులు ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.