Homemain slides'నాకు అంత త్వరగా చావురాదు'

‘నాకు అంత త్వరగా చావురాదు’

భారత్ సమాచార్, జాతీయం : పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం ఇప్పటికే హాసన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే హాసన్‌ జేడీఎస్‌ నేతలతో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ సమావేశాలు నిర్వహించారు, మాజీ మంత్రి రేవణ్ణ దంపతులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి కూడా హాసన్ జేడీఎస్ నేతలతో సమావేశం అయ్యారు. హసన్‌లో జరిగిన జేడీఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ… ప్రజ్వల్ తన అన్న రేవణ్ణ కొడుకు మాత్రమే కాదని, అతను నా కొడుకు అని, ప్రజ్వల్ లో మార్పు తీసుకువచ్చే బాధ్యత తానే తీసుకుంటానని, ప్రజ్వల్ రేవణ్ణ గెలుపుకు మీరు అందరూ కృషి చేయాలని జేడీఎస్ పార్టీ కార్యకర్తలకు మాజీ సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. తన సోదరుడు రేవణ్ణ హాసన్ జిల్లాలో చేసిన అభివృద్ధి పనుల ముందు తాను చేసింది తక్కువే అని, తన అన్నకొంచెం కోపంగా ఉంటాడు అంతే అని, ఆయన చాలా మంచి వాడు అంటూ మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

నాకు అంత త్వరగా చావురాదు:
బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి డాక్టర్ మంజునాథ్ పోటీ చేస్తారని కుమారస్వామి తెలిపారు. మీరు ఎన్నికల్లో దేవెగౌడను ఓడించారు. అయినా తన తండ్రి, మేము హాసన్‌ను మరిచిపోలేదని, , జిల్లాలో తాను ఉన్నానని, దేవెగౌడ చేయలేని ఎన్నో పనులు ఇక్కడ ప్రజ్వల్ రేవణ్ణ చేశారని, ఈ ఒక్కసారికి అతన్ని గెలిపించాలని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. రైతులకు, జేడీఎస్ పార్టీకి, కార్యకర్తలకు మంచి చేసి వారికి ఓ దారి చూపించే వరకు తాను చచ్చిపోను అని, తనకు అంత త్వరగా చావురాదని, జేడీఎస్ పార్టీని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న వారిని తాను ఈ మాట చెబుతున్నానని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరికొన్ని రాజకీయ కథనాలు…

‘ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే అలా జరిగింది’

RELATED ARTICLES

Most Popular

Recent Comments