Homebreaking updates newsపవన్ కు హరిరామ జోగయ్య లేఖ

పవన్ కు హరిరామ జోగయ్య లేఖ

భారత్ సమాచార్; జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాజీమంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య నేడు లేఖ రాశారు. కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు సమానంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించాలని అందులో సూచించారు. బీసీలకు ప్రకటించిన వివిధ హామీలను కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలని కోరారు. తాజాగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కాపు ఓట్ల కోసం ప్రత్యేక వ్యూహం చేపట్టాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments