Homebreaking updates newsనెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి

నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి

భారత్ సమాచార్, హైదరాబాద్;

ప్రస్తుతం హైదరాబాద్ నగర వాసుల ముచ్చట్లు మొత్తం హైడ్రా గురించే సాగుతున్నాయి. ప్రతి రోజూ అంచనాలకు మించి వార్తల్లో నిలుస్తోంది హైడ్రా సంస్థ. పారిశ్రామిక, సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ హైడ్రానే. నెల రోజుల్లో హైడ్రా సాధించిన పురోగతి పై నేడు సంస్థ ప్రభుత్వానికి నివేదిక అందించింది. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొంది. పలువురు విఐపి లతో టు పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపింది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడినట్టు హైడ్రా నివేదికలో తెలిపింది. నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకోరుల నుంచి కాపాడిన హైడ్రా. లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా. మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా. గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత. గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత. బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత. చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా. నందగిరి హిల్స్ లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.

మరికొన్ని వార్తా విశేషాలు…

హైడ్రా కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు

RELATED ARTICLES

Most Popular

Recent Comments