Homemain slidesదిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

భారత్ సమాచార్, దిల్లీ ;

దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మళ్లీ జూన్ 2న కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

భారత ఎన్నికల కమిషన్ సరిగ్గా 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే తరుణంలో దేశ రాజకీయాల్లో దిల్లీ మద్యం కుంభకోణం అకస్మాత్తుగా మరోసారి తెర పైకి వచ్చింది. ఈ కేసులో అప్పటికే దిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటుగా మరికొద్ది మందిని ఈడీ అరెస్టు చేసింది. మరికొందరిని అదుపులోకి తీసుకుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల కోసం కేజ్రీవాల్ ఇండియా కూటమి తరపున ప్రచారం చేయాలనుకున్న సమయంలో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకొని కస్టడీలోకి తరలించిన తర్వాత కూడా జైలు నుంచే కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు. అప్పటి నుంచి కూడా కుంభకోణంపై కోర్టులో విచారణ సాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈడీ అదుపులోకి తీసుకోవటంపై అమెరికా, జర్మనీ దేశాలు కామెంట్ చేసిన విషయం కూడా తెలిసిందే.

దీంతో అరవింద్ కేజ్రీవాల్ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మార్గం సుగమమైంది. మార్చి 21 నుంచి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై పూర్తి విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. అతి త్వరలోనే ఆ కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ బెయిల్ షరతులకు సంబంధించిన రాతపూర్వక ఆదేశాలు ఇంకా వెలువడాల్సి ఉంది. కాగా ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశల పోలింగ్ పూర్తయింది. మే 13వ తేదీన మూడో దశ పోలింగ్ జరుగనుంది.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

నరేంద్ర మోడీ‌@420 హామీలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments