Homebreaking updates newsUSA-Iran: అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్

USA-Iran: అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్

భారత్ సమాచార్.నెట్: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. దీనిపై ఇరాన్ గానీ, అమెరికా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ స్థానిక మీడియాలో అమెరికా సైనిక స్థావరాలపై ఈ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌లోని మూడు అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దాడులు జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇరాన్ దాడులు నిజంగానే జరిగాయా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య గత 9 రోజులుగా జరుగుతున్న యుద్ధం అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. జూన్ 21న ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది. ఈ దాడులపై అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అటు ప్రపంచ దేశాలు సైతం ఈ దాడిని ఖండించాయి.
 మరోవైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను కిమ్ ఖండించాడు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఇది సార్వభౌమ దేశ భద్రతా ప్రయోజనాలు, ప్రాదేశిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని కిమ్‌ తెలిపారు. ఇరాన్‌పై ఇంచి దాడులు జరిగితే.. వాటికి ఉత్తరకొరియా కూడా ధీటుగా స్పందిస్తుందంటూ కిమ్ హెచ్చరించారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments