Homemain slidesహిమాలయాల్లో అతి పెద్ద ఉపద్రవం రాబోతుందా?

హిమాలయాల్లో అతి పెద్ద ఉపద్రవం రాబోతుందా?

భారత్ సమాచార్, అంతర్జాతీయం : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైకి హిమాలయాల్లో పైకి చల్లగానే కనిపిస్తోంది. అయితే లోపల భారీ సంఘర్షణకు దారితీస్తున్నట్టు తెలుస్తోంది. భారత టెక్టోనిక్ ప్లేట్(ఫలక)లో చీలిక వస్తోందని భూగర్భ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరేషియన్ టెక్టోనిక్ ఫలకతో నిత్య సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణులు మరింత ఎత్తుకు పెరిగే అవకాశం ఉంది. ఇలా ఎత్తు పెరుగుకుంటూ పోతే ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్న టిబెట్ రెండు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని రీసెంట్ గా యూఎస్ఏలోని శాన్ ఫ్రాస్కిస్కో లో జరిగిన జియో ఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు.

భారత టెక్టోనిక్ ఫలక సంఘర్షణ ప్రభావాన్ని కూడా వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ టెక్టోనిక్ ఫలక ఐదు సెంటీమీటర్లు ముందుకు కదలడం వల్ల హిమాలయాల పరిధిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్ద ఉపద్రవానికి దారితీసే అవకాశం ఉందంటుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల భారత్ లో విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ లో కదలిక వల్ల హిమాచల్ ప్రదేశ్, నేపాల్ లో భూకంపాలు సంభవించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

అయితే ఇండియాలో ఏర్పడిన టెక్టోనిక్ ప్లేట్ కు కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాతన గోండ్వానాలో టెక్టోనిక్ ప్లేట్ అనేది ఒక భాగం. ఇది 10 కోట్ల సంవత్సరాల క్రితం ఇతర శకలాల నుంచి విడిపోయి భారత టెక్టోనిక్ ప్లేట్ ఏర్పడింది. ఇది ఉత్తరం వైపు కదులుతూ వచ్చింది. ఇది యూరేషియన్ ప్లేట్ ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఉద్భవించాయి. ప్రస్తుతం ఇది యూరేషియన్ ప్లేట్ వైపు కదులుతూ ఢీకొట్టోంది. దీంతో హిమాలయాలు మరింత ఎత్తు పెరుగుతుండడం వల్ల టిబెట్ రెండు ముక్కలు అవుతుంది. అలాగే హిమాలయ ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవిస్తాయి. మరి దీనికి విరుగుడు ఎలా అనేది శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

భారత్ మ్యాప్ లో శ్రీలంకను ఎందుకు చూపిస్తారు?

RELATED ARTICLES

Most Popular

Recent Comments