Homebreaking updates newsJyoti malhotra: దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా జ్యోతి మల్హోత్రా వ్యవహారం

Jyoti malhotra: దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా జ్యోతి మల్హోత్రా వ్యవహారం

భారత్ సమాచార్.నెట్: పాకిస్థాన్‌ (Pakistan)కు భారత్ (India) నుంచి కీలక సమాచారం (Information) చేరవేస్తూ గూఢచారిగా (Spy) వ్యవహరించిన హర్యానాకు చెందిన యూట్యూబర్ (Haryana Youtuber) జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా పేరు దేశవ్యాప్తంగా వినిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి.. ఆయా ప్రాంతల వీడియోలు రికార్డు చేసి.. పాక్‌కు అందించినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమెను హర్యానా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు విచారణలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.  పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ (ISI) ఏజెంట్లు మల్హోత్రాను ఓ అస్త్రంలా ఉపయోగించుకున్నట్లు అధికారులు తేల్చారు. అంతేకాదు ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్న డానిష్ అనే అధికారితో జ్యోతి మల్హోత్రాకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌‌తో పాటు పలుమార్లు చైనాకు వెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
గతంలో భారత్ బహిష్కరించిన ఓ పాక్ అధికారితో ఆమెకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు కూడా అధికారులు తెల్చారు. ఆమె ఆర్థిక లావాదేవీలు, విదేశీ ప్రయాణాల వివరాలను విచారిస్తున్నామని, ఆమె ఎవరికెవరిని కలిసింది? ఎక్కడెక్కడకు వెళ్లింది? అనే అంశాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే ఆమె ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర డిజిటల్ పరికరాలపై ఫోరెన్సిక్ పరిశీలన జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా సంబంధాలను కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments