భారత్ సమాచార్.నెట్: మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) సినిమా మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ (VFX) ఆలస్యం అవుతుండడంతో ఈ మూవీని వాయిదా (Delayed) వేసినట్లు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రకటించారు. కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. హైయెస్ట్ స్టాండర్స్ (Highest Standards)తో సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ (X) వేదికగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ప్రియమైన అభిమానులకు, సినీ ప్రేమికులకు విజ్ఞప్తి.. కన్నప్ప పోస్ట్ ప్రోడక్షన్ పనలు అద్భుతంగా సాగుతున్నాయి. ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా మీ ముందుకు తీసుకొచ్చేందు వీఎఫ్ఎక్స్ అవసరం. అందుకే ప్రస్తుతానికి ఆ పని మీద దృష్టి పెట్టాం. ఇందుకు మాకు మరింత సమయం పట్టేలా ఉంది. మూవీ విడుదల ఆలస్యం అవుతున్నందుకు అభిమానులకు, సినీ ప్రియులకు క్షమాపణలు చెబుతున్నాం. త్వరలోనే కొత్త తేదీతో మీ ముందుకు వస్తామంటూ విష్ణు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాను మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మంచు విష్ణు తన సొంత బ్యానర్ అవ ఎంటర్టెన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ చిత్రంలో ప్రభాస్తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే.