Homebreaking updates newsKedarnath: ముస్తాబైన కేదార్నాథ్ ఆలయం.. రేపు తెరుచుకోనున్న ఆలయ తలుపులు

Kedarnath: ముస్తాబైన కేదార్నాథ్ ఆలయం.. రేపు తెరుచుకోనున్న ఆలయ తలుపులు

భారత్ సమాచార్.నెట్: కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) ముస్తాబైంది. రేపే ఆలయ తలపులు (Temple Doors) తెరచుకోనున్నాయి. 13 క్వింటాళ్ల పూలతో (Decorated with Flowers) ఆలయాన్ని అలకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ తలుపులు.. రేపు ఉదయం 7 గంటలకు తెరవనున్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి క్షేతాల ద్వారాలను తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి, యమునోత్ర మందిరాన్ని దర్శించుకున్న భక్తులపై పూల వర్షం కురిపించారు అధికారులు.

గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల ఆలయ తలుపులు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. యమునోత్రి దగ్గర కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. రెండు చోట్లా మొదటి పూజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట జరిగాయి. చార్‌ధామ్ యాత్ర ప్రశాంతంగా సాగాలని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ కోరుతూ పుష్కర్ సింగ్ ధామీ కోరుకున్నారు. యమునోత్రి ధామ్ దగ్గర కపాటోద్ఘాటన (ద్వారాలు తెరిచే) కార్యక్రమంలో పాల్గొన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీయే కావడం విశేషం.
చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిచారు. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచే వేళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. కాగా, 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను భక్తులు సందర్శించే సంగతి తెలిసిందే.
RELATED ARTICLES

Most Popular

Recent Comments