Homemain slidesKeerthy Suresh: భర్తతో మాల్దివ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహానటి

Keerthy Suresh: భర్తతో మాల్దివ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహానటి

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటి (Actress) కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం తన భర్త ఆంటోనీతో కలిసి మాల్దీవ్స్‌ (Maldives)లో ఎంజాయ్ చేస్తోంది. గతేడాది తన బాల్య స్నేహితుడు ఆంటోనీ పెళ్లి చేసుకున్న కీర్తి ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వీలు కుదిరినప్పుడల్లా భర్తతో కలిసి హాలిడే ట్రిప్స్‌కు వెళ్తోంది. మాల్దీవ్స్‌ ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కీర్తి.

కీర్తి సురేష్ పోస్టు చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కీర్తి ఈ ట్రావెల్‌ డైరీని ఒక స్టైలిష్ సెల్ఫీతో ప్రారంభించారు. తెల్లటి దుస్తులు, పెద్ద టోపీ ధరించి పట్టు తెచ్చిన లుక్‌లో ఉన్న ఆమె ఫోటో మొదటగా పోస్ట్ చేశారు. అనంతరం మాల్దీవ్స్‌లో వారు స్టే చేసిన రిసార్ట్‌లో పడవ విహారం చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేశారు. ఆపై భర్త ఆంటోనీతో కలిసి దిగిన ఒక అందమైన జంట ఫోటోను పోస్ట్ చేశారు, అది కీర్తి రిలాక్స్డ్‌, స్టైలిష్‌ మూడ్‌ను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది.
అంతేకాదు మాల్దీవ్స్‌లో రుచి చూసిన ప్రత్యేక వంటకాల ఫోటోలను కూడా ఆమె తన పోస్ట్‌లో చేర్చారు. ఇకపోతే సినిమా ప్రపంచంలో బాల నటిగా అడుగుపెట్టి, నేడు అగ్ర కథానాయికగా వెలుగొందుతోన్న కీర్తి సురేశ్ సినీ ప్రయాణం 25 ఏళ్లకు చేరింది. దక్షిణాదిన ప్రత్యేకించి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో రివాల్వర్ రీటా అనే మహిళా ప్రాధాన్యత కలిగిన కామెడీ చిత్రంలో నటించనున్నారు. కె. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రెడ్డిన్ కింగ్స్లే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments