భారత్ సమాచార్.నెట్: సీతారామం (Sita Ramam) మూవీతో తెలుగు తెర (Telugu Screen)పై అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో.. సీతా పాత్రలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ను సంపాదించుకుంది. 2018లో ‘లవ్ సోనియా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ.. తర్వాత ‘తుఫాన్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ వంటి చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపును పొందింది.
అదే సమయంలో దుల్కర్ సల్మాన్తో కలిసి ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన వింటేజ్ లుక్, ఆకట్టుకునే నటనతో తెలుగు ఆడియెన్స్ మనసులను దోచేసింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెట్టింట ‘మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్’గా నిలిచింది మన ‘సీత’. సోషల్ మీడియా వేదికలపై ఆమె గురించే ఎక్కువగా చర్చ జరుగుతోందట. ఇందుకు ప్రధాన కారణం ఆమె తరచూ పోస్ట్ చేసే ఫొటోలు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో నిత్యం కొత్త ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది మృణాల్. గ్లామరస్ లుక్, స్టైలిష్ ఫోజులు, స్పైసీ క్లిక్స్తో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అంతేకాదు, ఆమె ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవే కారణాల వల్ల మృణాల్ పోస్టులు తరచూ ట్రెండింగ్లో ఉంటాయి. ఈక్రమంలో, ఆమెకు ఇప్పుడు ‘నెట్టింట మోస్ట్ పాపులర్ నటి’ అనే అరుదైన గౌరవం దక్కింది. కాగా ప్రస్తుతం అడవి శేషుతో డేకాయిట్ చిత్రంలో మృణాల్ నటిస్తున్నారు.