Homebreaking updates newsభాగ్యనగరం నుంచి గోవా వరకు

భాగ్యనగరం నుంచి గోవా వరకు

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ తాజాగా తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచిగూడ – యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇప్పుడు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నూతన సర్వీసును అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌-గోవా బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ… వాస్కోడగామా చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది.

మరికొన్ని వార్తా విశేషాలు…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments