భారత్ సమాచార్, విశాఖపట్నం : ‘నిర్భయ’ ఘటనలో ఉరిశిక్షలు పడినా.. కొందరు దుర్మార్గులు తమ కామ పైశాచికాన్ని వదలిపెట్టడం లేదు. ఆడపిల్లల రక్షణకు దేశంలో చోటు లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిర్భయ ఘటన కంటే దారుణమైన, సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది.

తాజాగా విశాఖ పట్టణంలో ఒక దళిత బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో ఆ బాలిక నరకాన్ని అనుభవించింది. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17ఏండ్ల బాలికను వంచించి…