భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
భారత రైల్వే శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఉన్న పారా-మెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్ 04/2024 నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణకు 16.09.2024 చివరి తేదీ. 17.09.2024 నుంచి 26.09.2024 వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరణ చేసుకోవచ్చు.
ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్, అజ్మేర్, గోరఖ్పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్కతా, సికింద్రాబాద్, బిలాస్పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.
పోస్టుల వారీగా ఖాళీలు:
1. డైటీషియన్ (లెవల్-7): 05 పోస్టులు
2. నర్సింగ్ సూపరింటెండెంట్: 713 పోస్టులు
3. అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్: 04 పోస్టులు
4. క్లినికల్ సైకాలజిస్ట్: 07 పోస్టులు
5. డెంటల్ హైజీనిస్ట్: 03 పోస్టులు
6. డయాలసిస్ టెక్నీషియన్: 20 పోస్టులు
7. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-III: 126 పోస్టులు
8. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్: 27 పోస్టులు
9. పెర్ఫ్యూషనిస్ట్: 02 పోస్టులు
10. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II: 20 పోస్టులు
11. ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 02 పోస్టులు
12. క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 02 పోస్టులు
13. ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 246 పోస్టులు
14. రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్: 64 పోస్టులు
15. స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
16. కార్డియాక్ టెక్నీషియన్: 04 పోస్టులు
17. ఆప్టోమెట్రిస్ట్: 04 పోస్టులు
18. ఈసీజీ టెక్నీషియన్: 13 పోస్టులు
19. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II: 94 పోస్టులు
20. ఫీల్డ్ వర్కర్: 19 పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,376.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపికను నిర్వహిస్తారు.
రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అరిథ్మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100.
పరీక్ష సమయం: 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://rrcb.gov.in/rrbs.html ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.