Homemain slides‘నువ్వు-నేను’మళ్లీ థియేటర్ లో

‘నువ్వు-నేను’మళ్లీ థియేటర్ లో

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; టాలీవుడ్ సినీ ప్రియులకు మరపురాని ప్రేమ కథా చిత్రం ‘నువ్వు-నేను’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది ఈ మూవీ. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘నువ్వు-నేను’ సినిమాని కూడా మళ్లీ థియేటర్ లో అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ లవ్, మ్యూజికల్ మ్యాజిక్ మార్చి 21న 4కె క్వాలీటీతో మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది.

2001 ఆగష్టు 10న ఈ మూవీ విడుదలైంది. ఉదయ కిరణ్, అనిత జంటగా నటించగా తేజ దర్శకత్వం వహించాడు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. ఇందులోని అన్ని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు,
ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందాయి.

మరికొన్ని సినీ సంగతులు…

‘లెజెండ్’ మూవీ రీరిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments