భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack), ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)తో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్, భారత్పై దాడులు చేపట్టగా.. దానిని కూడా భారత్ ఆర్మీ (Indian Army) వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా అమృత్సర్ (Amritsar)లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది.
పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు. భారత్ దాడి అనంతరం పాక్ దాడులకు పాల్పడుతుందని ముందే అంచనా వేసినట్లు తెలిపారు. మిలిటరీ టార్గెట్లతో పాటు స్వర్ణ దేవాలయం వంటి మతపరమైన ప్రదేశాలు, పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడి చేస్తుందని ముందే భారత్ సైన్యం ముందుగానే ఊహించిందన్నారు.
ముఖ్యంగా గోల్డెన్ టెంపుల్పై దాడి చేయడం వాళ్ల లక్ష్యమని గుర్తించడంతో.. టెంపుల్ వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించి.. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేశామని.. గోల్డెన్ టెంపుల్పై ఒక్క గీత పడకుండా రక్షించామని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్థాన్లోని అనేక ప్రదేశాలను అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశాయని.. ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న మురిద్కే, బహవల్పూర్ వంటి ప్రాంతాలపై దాడి చేశామన్నారు. భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలేపైనే టార్గెట్ చేసిందని చెప్పారు.