భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
మనకి ఇటీవల కాలంలో అయ్యప్ప దీక్షల తాకిడి బాగా పెరిగింది. అయ్యప్ప దీక్షలు, ఒకప్పుడు అక్కడక్కడా కనిపించే దీక్షధారులు ఇప్పుడు అన్ని సమయాలలోనూ, అన్ని చోట్ల కనపడుతున్నారు. గత రెండు మూడు దశాబ్దాలలో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 41 రోజులు దీక్ష చెయ్యడం, తర్వాత శబరి క్షేత్రానికి వెళ్లి ఆ దీక్ష విరమణ చెయ్యడం ఆనవాయితీగా వస్తోంది. నిజానికి దీక్షల యొక్క పరమ ఉద్దేశ్యం కూడా మనోసంస్కారమే. మనం ఐహికమైన ఆలోచనల నుంచి దూరంగా 41 రోజులు ఉంటె మన బుద్ధి క్రమంగా ఐహికమైన విషయాల జోలికి వెళ్లదు. వెళ్లినా వాటి మీద సాధకునికి ఆసక్తి ఉండదు. అటువంటి స్థితిని చేరిన సాధకుడు దీక్ష యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందినవాడు అవుతాడు. దీక్షతో పరిపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్య వ్యక్తిగా మారతాడు
1) ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు నలుపు దుస్తులు మాత్రమే ధరించాలి. కన్ని స్వామి అయిన గురు స్వామి అయిన నలుపు వస్త్రములు మాత్రమే ధరించాలి.
2) ఎరుపు వస్త్రం యాత్ర సమయాల్లో మాత్రమే ధరించాలి. తప్ప మామూలుగా ధరించకూడదు, మాల ధరించిన భక్తులు సన్యాస ధర్మంలో లేము బ్రహ్మచర్య దీక్షలో మాత్రమే ఉన్నాము కాబట్టి కాషాయ వస్త్రాలు అందరు వేయడానికి లేదు.
3) భక్తులు చేసేది బ్రహ్మ చర్య దీక్ష మాత్రమే, సన్నాసి దీక్ష కాదు వనయాత్రలో మాత్రమే ఎరుపు వస్త్రం ధరించాలి. స్వాములకు ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటుంది.
4) గురు స్వాములు పడిపూజ సమయాలు పాటించాలి. సాయంత్రం 6:00pm to 10:00pm.
5) అన్న ప్రసాదం విషయంలో అందరూ మసాలా దినుసులను నిషేధించాలి. సాత్విక ఆహారం వుండే విధంగా చూసుకోవాలి. పూజకు వచ్చిన స్వాములు ఆనందం గా ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
6) అయ్యప్ప అభిషేకం మధ్యాహ్నం 12 లోపల చేసేవిధంగా ప్రయత్నం చేయాలి. అభిషేక వస్తువులు ఒక్కసారి గమనించాలి. ఆవు పాలు , ఆవు పెరుగు , ఆవు నెయ్యి , తేనె , చెరుకు రసం , వీటితోనే స్వామివారికి అభిషేకం జరిగేలా చూడాలి స్వామి.
7) పవిత్రమైన అయ్యప్ప పూజలను పవిత్రంగా చూడండి , అప్పులు తెచ్చి మరీ పూజలు చేయకండి. అలా చేసిన ఎడల మీ ఇంటి సభ్యులు మాత్రమే కాదు సమాజం కూడా అయ్యప్ప స్వామి మాల వేయడం వలన అప్పులు పాలైపోయారు అని అనకూడదు.. మీకు వున్నదాంట్లో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి పూజలు చేసుకోవాలి.
8) ముఖ్యంగా , కన్ని స్వామి చాల నిగ్రహం తో నియమం పాటించాలి అని వారి వారి గురు స్వాములు శిక్షణ ఇవ్వాలి. నియమాలు సరిగ్గా పాటిస్తేనే మన దీక్ష పరిపూర్ణం అవుతుందని వారికి తెలియజేయాలి.
9) పవిత్రమైన బంగారు 18మెట్లు ఎక్కడానికి బ్రహ్మచర్య కఠోర దీక్ష నియమాలు తప్పని సరీ పాటించాలి , అయ్యప్ప స్వామిని దర్శించుకోడానికి మనం పడిన తపన & కృషి ఆ భగవంతుడికి కనపడాలి.
10) ఎన్నిసార్లు శబరిమల వెళ్ళామన్నది ముఖ్యం కాదు అయ్యప్ప మాల యెక్క పవిత్రతను పవిత్రంగా ఆచరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం.