భారత్ సమాచార్.నెట్: దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) పై ప్రధాని మోదీ (PM Modi) మరోసారి నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) కి కేవలం 22 నిమషాల్లోనే జవాబు ఇచ్చామన్నారు ప్రధాని మోదీ. మన ఆడబిడ్డల సింధూరం (Sindoor) తుడిచేస్తే ఏం జరుగుతుందో మన శత్రు దేశంతో పాటు ప్రపంచానికి (World) కూడా తెలిసొచ్చేలా చేశామన్నారు. భారత్ (India) నేలపై రక్తపుటేర్లు పారించిన.. వారిని ముక్కలు ముక్కలుగా చేసామన్నారు. మన మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచిన వారిని మట్టిలో కలిపేశామని పేర్కొన్నారు. రాజస్థాన్లోని బికననేర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ మౌనంగా ఉంటుందనుకున్న వాళ్లు ఇప్పుడు భయపడుతున్నారని.. ఉగ్రవాదంపై పోరాటానికి దేశం మొత్తం ఐక్యంగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మనసులను కదిలించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెలపై దాడి చేశామన్నారు. ఇది త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛనివ్వడం వల్ల సాధ్యమైందని మోదీ చెప్పుకొచ్చారు. త్రివిధ దళాల దెబ్బతో పాకిస్థాన్ వెనక్కి తగ్గిందన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే అణు బాంబులు వేస్తామని బెదిరిస్తే భారత్ ఏమాత్రం భయపడదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రం తర్వాత పాక్ మళ్లీ భారత్పైకి దాడికి దిగే ప్రయత్నం చేస్తోందని.. భారతలో మరో దాడి జరిగితే.. ప్రతీకారం బలంగా తీర్చుకుంటామని పునరుద్ఘటించారు. అదేవిధంగా ఒకవేళ చర్చలంటూ పాక్తో జరిగితే కేవలం పీవోకే అంశం పైనే జరుగుతాయన్న ప్రధాని.. పాక్కు చుక్క నీటిని కూడా వదిలేది లేదని తేల్చి చెప్పారు.