భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
భారతీయ సెంట్రల్ రైల్వే జోన్ అప్రెంటిస్షిష్ రిక్రూట్మెంట్ కు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrccr.com ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి గడువు ఆగస్టు 15వ తేదీన ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…
* ఖాళీల వివరాలు
సెంట్రల్ రైల్వే డివిజన్లో అప్రెంటిస్షిప్లో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2,424 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.
* ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐలో సంబంధిత ట్రేడ్లో నేషనల్ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ జారీ చేసే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ను కూడా కచ్చితంగా పొంది ఉండాలి.
* వయోపరిమితి
అభ్యర్థుల వయసు కనీసం 15 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటాయి.
* సెలక్షన్ ప్రాసెస్
వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
* అప్లికేషన్ ఫీజు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 ఆన్లైన్లో చెల్లించాలి. ఇక, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
* స్టైఫండ్
ఎంపికయ్యే అభ్యర్థులకు స్టైఫండ్ నెలకు రూ.7000 ఉంటుంది. అప్రెంటిస్గా ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ నిర్వహిస్తారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్షిప్ యాక్ట్-1956 ప్రకారం ఈ రిక్రూట్మెంట్ చేపడుతోంది. అప్రెసంటిస్ షిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ లభిస్తుంది. ఆర్ఆర్బీ నిర్వహించే పోటీ పరీక్షల్లో కొన్ని పోస్టులకు రిజర్వేషన్ ఉంటుంది.