Homemain slidesఏపీ విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల

ఏపీ విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర స్థితిగతులపై 7 శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో భాగంగా ద్యుత్‌ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ ఐదేళ్ల ఏలుబడిలో విద్యుత్ రంగం పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం.. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. కానీ, అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం.. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి” చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లకు చెప్పామన్న చంద్రబాబు రూ.500,200 నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్ ను దారుణంగా దెబ్బ తీశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

జగన్ దుర్మార్గానికి పోలవరం హైడల్‌ ప్రాజెక్టులోనే 4 వేల 773 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏపీ బెవేరేజస్ కార్పొరేషన్ బాండ్లలో ఏపీ జెన్ కో, ట్రాన్స్కో లు పెట్టుబడులు పెట్టాయంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సెకి నుంచి కొనుగోలు చేయాల్సిన 7 వేల మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్స్మిషన్ కోసమే 3850-4350 కోట్లు అదనం గా చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాగే 25 ఏళ్లు చెల్లింపులు చేస్తే 62 వేల కోట్ల రూపాయల మేర భారం ప్రభుత్వం పై పడుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో ను విద్యుత్ సంస్థలు కు నష్టాలు వస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల వారత్వంగా ఎన్డీఏ ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల నష్టాలు అందాయని వివరించారు. ఈ నష్టాలు తగ్గించడం, ఆయా సంస్థలు ను పునర్నిర్మించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వ్యవస్థని గాడిలో పెట్టడం సహా ప్రజలకు భారం లేకుండా చూడాలన్నారు. దీనిపై ప్రజల నుంచి కూడా ఆలోచనలు తీసుకుంటామని వెల్లడించారు. అత్యంత కీలకమైన రంగం కాబట్టే శ్వేత పత్రం విడుదల చేశామన్నారు.

కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ ల విషయం లో త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అక్కడ సోలార్ పెట్టేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఎమోషనల్ నిర్ణయాలు ఏవీ తీసుకోనన్నారు. గ్రీన్ హైడ్రోజెన్ లాంటి నూతన సాంకేతికత ను అందిపుచుకుంటే కొన్ని సమస్యలు అధిగమించే అవకాశం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ను గ్రీన్ హైడ్రోజెన్ జోన్ గా కేంద్రం ఎంపిక చేసిందని తెలిపారు. 2019 -24 మధ్య గత ప్రభుత్వ హయాంలో ప్రజలపై 32,166 కోట్ల రూపాయల మేర భారం మోపారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ సంస్థల పై 49,596 కోట్ల మేర అప్పులు తెచ్చారన్నారు. పాలనా పరమైన కారణాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొన్న నష్టాల విలువ 47, 741 కోట్ల రూపాయలు గా ఉందని తెలిపారు. మొత్తంగా ప్రజల పైనా, ప్రభుత్వానికి 1,29,503 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని వెల్లడించారు.

మరికొన్ని తాజా వార్తా విశేషాలు…

కూటమిలో ‘నామినేటెడ్’ లెక్కలపై చర్చ

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments