Homebreaking updates newsఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్

ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్

భారత్ సమాచార్.నెట్, కృష్ణా: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను జాతీయ రహదారిపై లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఓవర్ టేక్ చేస్తూ కంటైనర్‌ను ఢీకొట్టిన బొలెరో:
పాండిచ్చేరి నుంచి భీమవరం రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను.. అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్ళరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టింది. శీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొని ఓవర్ టేక్ చేస్తూ కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. గాయపడిన మిగిలిన ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం మూలంగా రోడ్డుపై రెండు కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనంలో డ్రైవర్‌తోపాటు 10 మంది ప్రయాణికులు ఉన్నారని, లారీలో డ్రైవర్‌తోపాటు మరో ప్రయాణికుడు ఉన్నట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments