HomeUncategorizedబాధితుడికి 'సహయోగ్' ఫౌండేషన్ ఆర్థిక చేయూత

బాధితుడికి ‘సహయోగ్’ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామానికి చెందిన జానపాటి రమేశ్ మెదడులో బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకునున్న ‘సహయోగ్’ ఫౌండేషన్ ప్రతినిధులు చికిత్స పొందుతున్న రమేశ్‌ను పరామర్శించి వారి కుటుంబసభ్యులకు రూ.7400 ఆర్థికసాయం అందజేశారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబానికి దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో కానిస్టేబుల్, సహయోగ్ ఫౌండేషన్ సభ్యులు జీ.లింగస్వామి, హోంగార్డ్ సత్తయ్య ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments