భారత్ సమాచార్.నెట్: టాలీవువుడ్ బ్యూటీలు సమంత, శ్రీలీలలు ఒకే వేదికపై తళుక్కుమన్నారు. ఫ్యాన్స్లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మలు తాజాగా ముంబైలో నిర్వహించిన జీక్యూ సంస్థ మోస్ట్ ఇన్ఫ్వూయెన్షియల్ యంగ్ ఇండియన్స్ 2025 పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు తమదైన శైలిలో భిన్న రీతుల్లో ఒక్కొక్క రకమైన డ్రెస్సింగ్ స్టైల్లో హాజరవుతారు.
ఈ కార్యక్రమంలోనే సమంత, శ్రీలీల ఒకే వేదికను పంచుకున్నారు. ఒకేసారి కలుసుకుని ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఈ ఈవెంట్లో శ్రీలీల తన స్టైలిష్ లుక్తో అందరినీ ఆకట్టుకోగా.. థై హై స్ప్లిట్తో.. డీప్ నెక్ గౌన్లో గ్లామరస్ లుక్లో మెరిసింది సమంత. దీంతో ఫొటోగ్రాఫర్ల చేతికి ఎక్కువ సేపు పని చెప్పక తప్పలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఒకే ఈవెంట్లో, ఒకే స్టేజ్పై కనిపించటం సినీ అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది.
ఇకపోతే ఈ ఇద్దరు భామలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప 1లో ‘ఊ అంటావా మావ’ అనే పాటలో సమంత మెరిసింది. ఈ పాట యువతను ఓ ఊపు ఊపేసింది. ఇక పుష్ప-2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ‘కిస్సిక్’ అనే పాటలో ఆమె తన ఆకర్షణీయమైన డాన్సులతో, గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ పాట ద్వారా శ్రీలీలకు ఇండస్ట్రీలో మరిన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి.