భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
అమెరికాలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన ప్రపంచంతో పాటుగా ఇండియాలో కూడా ఆ ఎన్నికల హడావిడి కొంచెం కనిపించటం షరా మామూలే. అందులోనూ ఆంధ్రలో అయితే ఈ ఎన్నికల హడావిడి ఇంకొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు మరి.ఆయన పేరు జేడీ వాన్స్. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్. వాన్స్ భార్య తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. ఆమె పేరు చిలుకూరి ఉషా. ఆమె తల్లిదండ్రు లు చాలా సంవత్సరాలకు ముందు ఏపీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. 2015 నుంచి న్యాయ సేవల సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్ లో కార్పొరేట్ లిటిగేటర్ గా పనిచేస్తు న్నారు.
అంతకుముందు 2013లో యేల్ యూనివర్సిటీలో లా చేస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్ పరిచయం అయ్యారు వారి పరిచయం ప్రేమగా మార డంతో..2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారు లు ఇవాన్, వివేక్, కుమార్తే మిరాబెల్. ఉపాధ్యక్ష పదవికి ఒహాయే సెనేటర్ జేడీ వాన్స్ ఉషా చిలుకూరి రాజకీయాల్లో మొదట్నుంచీ భర్తకు అండగా నిలుస్తు న్నారు. రెండేళ్ల క్రితం ఒహాయో సెనేటర్ గా జేడీ వాన్స్ పోటీ చేసిన సమయంలోనూ ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యత లను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వాన్స్ మొదటిసారిగా అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు. వాస్తవానికి లా కోర్సు పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేటప్పుడు ఉషా చిలుకూరి, డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పట్లో ఆమె లెఫ్ట్ వింట్, లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేయగా, వివాహం తర్వాత ఉషా పార్టీ మారారు. భర్త జేడీ వాన్స్ సలహామేరకు రిపబ్లికన్ పార్టీలో చేరారు. అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే.