Homemain slidesసోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు

సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లికి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా? రారా? అంతకంటే ముందే ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయితే తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని అధికార పార్టీ నేతలు ప్రశ్నించారు . చివరికి ఆమె వ్యక్తిగత కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది.

వైద్యుల సూచనలమేరకే రాలేకపోతున్నా:
జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢిల్లికి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సి ఉంది. వైద్యుల సూచన మేరకు తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లు సోనియాగాంధీ వెల్లడించినట్లు సమాచారం.

మరిన్ని కథనాలు:

జూన్ 2న టెన్షన్ టెన్షన్..

RELATED ARTICLES

Most Popular

Recent Comments