Homebreaking updates newsజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి సన్‌రైజర్స్ ప్లేయర్ల ప్రత్యేక పూజలు

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి సన్‌రైజర్స్ ప్లేయర్ల ప్రత్యేక పూజలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubliee Hills) పెద్దమ్మ గుడి (Peddamma Temple) తెలియని వారు ఉండరు. రోజుకు ఈ ఆలయాన్ని వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రముఖులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లుంచుకుంటారు. తాజాగా ఈ ఆలయాని ప్రముఖ క్రికెట్ ప్లేయర్లు (Cricket Players) అభిషేక్ శర్మ (Abhishek Sharma), నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) దర్శించుకున్నారు. శనివారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజల అనంతరం ఆలయ అధికారులు వీరిని శాలువాతో సత్కరించారు.

ఇకపోతే రేపు ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) టీమ్ తలపడనుంది. ఐపీఎల్ 18 సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. మూడింటిలో ఓడి ఒక్క మ్యాచ్‌లో గెలచింది. ఇక గుజరాత్ జట్టు ఒకటి గెలిచి రెండు ఓడింది. దీంతో వరుస ఓటములతో ఉన్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌గో ఎలాగైనా గెలవాలని పట్టుమీదున్నాయి. ఇక రేపు జరగనున్న ఈ మ్యాచ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు వరుస ఓటములకు బ్రేక్ పడతుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌ను రాజస్థాన్‌పై భారీ విజయంతో ప్రారంభించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత హ్యాట్రిక్ ఓట‌ముల పాలైంది. ఎల్ఎస్‌జీపై 5 వికెట్లు, డీసీపై 7 వికెట్లు, చివ‌రి మ్యాచ్‌లో కేకేఆర్‌ చేతిలో 80 పరుగుల భారీ తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఇలా ఎస్ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్ ఓట‌ములు న‌మోదు చేయ‌డంప‌ట్ల ఫ్యాన్స్‌ ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అయిన ఐపీఎల్ టైటిల్ గెలిచేలా ఆశీర్వదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments