Homemain slidesఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి నేడు ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లు,పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని చెప్పారు. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నామని తెలిపారు.ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందని వెల్లడించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నాము. వారం రోజులపాటు నిర్వహిస్తున్నాము. గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారానికి, తీర్మానాలను అమలుచేసేందుకు, దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించాము. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు లాంటి పనులు చేపట్టాలి” అన్నారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. డైరెక్టర్ షణ్ముఖ్, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

పవనానంద స్వామి తిరుపతి కి వేంచేశారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments