Homemain slides"నేను తెలుగువాడిని... నాది తెలుగుదేశం పార్టీ"

“నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ”

భారత్ సమాచార్, రాజకీయం ; “నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ” అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఈ పార్టీ పెను సంచలనంగా మారింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారాన్ని సాధించి భారత రాజకీయాల్లో ఎప్పటికి చెరగని ఒక రికార్డ్ నెలకొల్పారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేటికి భారత రాజకీయాల్లో 42 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరిలో పార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో చంద్రబాబు
కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. నిజం గెలవాలి టీమ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండవల్లిలో ఘనంగా జరిగాయి. ఇందులో నారా భువనేశ్వరి పాల్గొన్ని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. కదిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం రూ. 12వేలకోట్లు ఖర్చుపెట్టిందన్నారు. హంద్రీనీవా కోసం తెలుగుదేశం ప్రభుత్వం రూ.4.200 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎవరు రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేశారో, ఎవరు రాయలసీమకు ద్రోహం చేశారో నిర్ణయించాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలేనని బాబు ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

మరి కొన్ని రాజకీయ విశేషాలు…

చంద్రబాబుతో జనసేనాని భేటీ

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments